మళ్ళీ ట్రాక్ లోకి వస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ .. ఈసారి నితిన్ కి జోడిగా బంపర్ ఆఫర్..!

-

ఎప్పుడో వచ్చిన ‘అ ..ఆ’ సినిమా తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి భీష్మ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో నితిన్. ఈ ఉత్సాహంతోనే వెంకీ అట్లూరి దర్శకత్వం లో
తెరకెక్కుతున్న రంగ్ దే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ కి జంటగా మహానటి ఫేం కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో తీసిన తొలిప్రేమ సినిమాతో హిట్ ఇండస్ట్రీ దృష్ఠిని ఆకర్షించాడు వెంకీ అట్లూరి. కాని ఆ తర్వాత అఖిల్ తో తీసిన మిస్టర్ మజ్ను తో ఫ్లాప్ పడింది. దాంతో ఈ సారి నితిన్ తో తీస్తున్న రంగ్ దే సినిమాతో గట్టి హిట్టు కొట్టాలని కసితో ఉన్నాడు ఈ కుర్ర దర్శకుడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ చూస్తుంటే నిజంగానే ఈ డైరెక్టర్ హిట్ ఇస్తాడన్న భావన కలుగుతుంది.

 

ఇక ఈ సినిమా తర్వాత నితిన్ భవ్య ఆర్ట్స్ క్రియేషన్స్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను సెలెక్ట్ చేసుకున్నట్టు తాజా సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ మన్మధుడు 2 ఫ్లాప్ అవడం తో మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు. కానీ బాలీవుడ్ లో ఒక సినిమా అలాగే శంకర్ – కమల్ హాసన్ ల ఇండియన్ 2 లో నటిస్తోంది.

అయితే టాలీవుడ్ లో అనూహ్యంగా నితిన్ సినిమాలో అవకాశం రావడం తో రకుల్ ఉబ్బి తబ్బిబ్బవుతుందట. దాదాపు సంవత్సరం నుండి మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న రకుల్ కి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఈ సినిమా గనక హిట్ అయితే ఇక రకుల్ కి మళ్ళీ టాలీవుడ్ లో వరసగా అవకాశాలు వస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తానికి ఎవరు పట్టించుకోక పోయినా నితిన్ రకుల్ ని ఆదుకున్నాడనమాట.

Read more RELATED
Recommended to you

Latest news