జాను ఫ్లాప్ అని సమంత ఒప్పుకుందిగా పాపం ..!

-

అక్కినేని సమంత-శర్వానంద్ జంటగా నటించిన తాజా చిత్రం ‘జాను’. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో సూపర్ హిట్ అందుకున్న 96 సినిమాకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కించారు. తెలుగు రీమేక్ ఎలా ఉంటుందా అనే ఆసక్తితో ప్రేక్షకులు థియోటర్స్ కి వస్తే వాళ్ళకి నిరాశనే మిగిల్చింది జాను. మార్నింగ్ షో నుండే మిక్స్డ్ టాక్ వచ్చింది. దాంతో సినిమా రెండవరోజు నుండే బాగా డల్ అయిపోయింది. దాంతో కలెక్షన్స్ కూడా డ్రాపయ్యాయి. మొదటి వారాంతంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 6.60 కోట్ల రూపాయల షేర్ సాధించింది.

 

ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా రూ. 19 కోట్లు. ఈలెక్కన బ్రేకీవెన్ అయ్యేందుకు ‘జాను’ షుమారుగా మరో 12 కోట్లు వసూలు చేయాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో ఈ సినిమా అంత వసూలు చేయలేదని ఈ సినిమాకు నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా 12 కోట్లు వసూలు చేసే అవకాశం ఎంతమాత్రం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. దీంతో బయ్యర్స్ పరిస్థితి దేవుడికే తెలియాలి అన్నట్టుగా ఉంది.

 

ఇదిలా ఉంటే హీరో శర్వానంద్ కు ఇది హ్యాట్రిక్ డిజాస్టర్ అని ఫిక్సవుతున్నారు. ‘జాను’ కు ముందు శర్వా నటించిన ‘పడి పడి లేచే మనసు’.. ‘రణరంగం’ రెండూ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయితే మాత్రం శర్వా కెరీర్ ఊహించలేము. అదీగాకుండా ‘జాను’ సినిమా కూడా ఎక్కువ గా సమంతా పేరు మీదే బిజినెస్ జరిగింది కాబట్టి ఆ రేంజ్ లో థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయి. ఇది కూడా ఈ కుర్ర హీరోకి పెద్ద మైనస్ గా చెప్పుకుంటున్నారు. ఇక శర్వానంద్ తన కెరీర్ విషయంలో.. కథల ఎంపిక లో గనక జాగ్రత్త పడకపోతే ఇక మళ్ళీ కనిపించడం కష్టమేనని మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ని నమ్ముకున్న కుర్ర హీరోలందరికి ఫ్లాప్స్ తప్పడం లేదు. ఇక ఇదిలా ఉంటే సమంత తన సన్నిహితుల దగ్గర జాను ఫ్లాపే అని ఒప్పుకుంటుందట.

Read more RELATED
Recommended to you

Latest news