అడివి శేష్ “మేజర్” చిత్రం వాయిదా..

-

అడవి శేష్ నటించిన మేజర్ సినిమా వాయిదా పడింది.2008 ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్ ‘ టైటిల్ రోల్ లో అడివి శేష్ నటిస్తుండడమే కాక ఈ చిత్రానికి కథను కూడా అందించారు.శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ఇండియా, GMB ఎంటర్టైన్మెంట్స్ A+S మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు.ఈ చిత్రాన్ని కన్నడ, మలయాళ, తమిళ భాషలలో కూడా విడుదల చేయనున్నారు.

ఈ సినిమాతో అడవి శేష్ పాన్ ఇండియా బరిలోకిి అడుగు పెట్టనున్నారు.ఇప్పటికే విడుదల కావలసిన ఈ చిత్రం కరోనాతో పాటు పలు కారణాల వల్ల వాయిదా పడి ఎట్టకేలకు మే 27న థియేటర్లలోకి రానుందని చిత్ర బృందంప్రకటించింది.అయితే తాజాగా ఈ మూవీ విడుదల మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మేజర్ చిత్ర బృందం ఒక అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసింది.దీనిని బట్టి మే 27న విడుదల కావలసిన ఈ చిత్రం ఒక వారం వాయిదా పడి మే 3న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news