అడివి శేషు ” మేజర్” సినిమా ట్రైలర్ రిలీజ్

-

విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేషు. క్షణం, గూడచారి, ఎవరు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న అడవిశేష్ ఇప్పుడు “మేజర్” గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.” గూడచారి” ఫెమ్ శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. మేజర్ జీవితంలోని వివిధ దశలను తెరపై ఆవిష్కరించారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ని విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా మేజర్ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు అడవిశేషు స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news