13 ఏళ్ల తర్వాత ఇద్దరు కలిశారు

-

టాలీవుడ్ లో క్రేజీ సినిమాలకు రైటర్ గా పనిచేసిన కోనా వెంకట్ తన పెన్నుని పక్కన పెట్టి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. లాస్ట్ ఇయర్ నిన్ను కోరి సినిమాతో నిర్మాతగా మారిన కోనా వెంకట్ తన సెకండ్ మూవీ మొదలు పెట్టాడు. ఈ సినిమా కోసం 13 ఏళ్ల క్రింత కలిసి నటించిన ఓ జంటను మళ్లీ కలిసి నటించేలా చేశాడు కోనా వెంకట్. ఇంతకీ 13 ఏళ్ల క్రితం నటించిన ఏ జోడి ఇప్పుడు కలిసి నటిస్తుంది అంటే మాధవన్, అనుష్క అని తెలుస్తుంది.

కోలీవుడ్ హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లవర్ బోయ్ గా తమిళంతో పాటుగా తెలుగులో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మాధవన్ ఈమధ్య వెరైటీ పాత్రలతో అలరిస్తున్నాడు. ఇక ఈమధ్యనే వచ్చిన నాగ చైతన్య సవ్యసాచి సినిమాలో విలన్ గా కూడా ఆకట్టుకున్నాడు మ్యాడీ. ఇక బాహుబలి 2 తర్వాత సినిమాలే చేయని అనుష్క లేటెస్ట్ గా కోనా చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాకు దర్శకుడిగా హేమంత్ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది.

మాధవన్ అనుష్క కలిసి రెండు అనే సినిమా చేశారు. మళ్లీ ఇన్నేళ్లకు కలిసి నటిస్తున్నారు. సైలెంట్ గా షూటింగ్ కానిస్తున్న ఈ సినిమాకు టైటిల్ కూడా సైలెంట్ అని పెడుతున్నారట. కోనా కార్పోరేషన్ నుండి వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి కలిగిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news