ప్రభాస్ జాను అంటున్నాడు

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో సినిమా చేస్తున్నాడు. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సాహో సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆ సినిమాను కూడా యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా ప్రేమకథ అని తెలుస్తుంది.

అందుకే ఈ మూవీకి టైటిల్ గా జాను అని పెట్టబోతున్నారట. జాను అంటే డార్లింగ్ అని అర్ధం. ప్రభాస్ డార్లింగ్ సినిమా మంచి హిట్ అయ్యింది ఆ క్రమంలో జానుకి మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమా చేస్తున్న పూజా జానుతో ప్రభాస్ తో కూడా జోడీ కడుతుంది. మొత్తానికి ప్రభాస్ పర్ఫెక్ట్ ప్లానింగ్ లోనే ఉన్నాడని చెప్పొచ్చు.

సాహో సినిమా ఆగష్టు 15న రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా కూడా ఆరోజు రిలీజ్ ఫిక్స్ చేశారు. రెండు భారీ బడ్జెట్ సినిమాలు అవడం చేత మరి ఆ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news