తెలంగాణ సీజే బదిలీ…

-

తెలంగాణ తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ కలకత్తా హైకోర్టు సీజేగా బదిలీ కానున్నారు. కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ డీకే గుప్తా డిసెంబర్ 31న పదవీ విరమణ చేయడంతో ఆ స్థానాన్ని రాధాకృష్ణన్ తో  భర్తీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  ఆరు నెలల వ్యవధిలోనే  ఆయన బదిలీ కావడం న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా వ్యవహరించే అవకాశమున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news