ఎన్టీఆర్ వల్ల చిక్కుల్లో పడ్డ అఖిల్

-

అక్కినేని అఖిల్ 3వ సినిమా వెంకీ అట్లూరి డైరక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. తొలిప్రేమ హిట్ తర్వాత వెంకీ అట్లూరి చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మిస్టర్ మజ్ను గా వస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను అనుకోకుండా ఎన్.టి.ఆర్ చిక్కుల్లో పడేశాడు.

అఖిల్ ను ఎన్.టి.ఆర్ ఎలా చిక్కుల్లో పడేస్తాడు అంటే ఎన్.టి.ఆర్ బయోపిక్ వల్ల అఖిల్ కు నష్టం వాటిల్లేలా ఉంది. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా రెండు పార్టులుగా వస్తుంది. అందులో మొదటిది ఎన్.టి.ఆర్ కథానాయకుడు.. మరోటి ఎన్.టి.ఆర్ మహానాయకుడు. ఈ రెండు సినిమాలు జనవరిలోనే వస్తున్నాయి. జనవరి 9న సంక్రాంతి బరిలో ఎన్.టి.ఆర్ కథానాయకుడు వస్తుంది.

ఇక రెండో పార్టుగా ఎన్.టి.ఆర్ మహానాయకుడు జనవరి 24న వస్తుంది. అయితే డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న అఖిల్ మిస్టర్ మజ్ను సంక్రాంతికి ఎలాగు పెద్ద సినిమాలున్నాయని జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ డేట్ కు రెండు రోజుల ముందు ఎన్.టి.ఆర్ వస్తున్నాడు. కథానాయకుడిగానే కాదు మహానాయకుడిగా ఎన్.టి.ఆర్ ప్రస్థానం అందరికి తెలిసిందే. అలాంటి ఎన్.టి.ఆర్ మహానాయకుడికి పోటీగా మిస్టర్ మజ్ ను నిలబడతాడా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news