సెట్లో కొట్టుకున్న హీరో, డైరెక్టర్….సోషల్ మీడియాలో మ్యాటర్ వైరల్…!!

-

బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎప్పుడూ వెరైటీగా సినిమాలు చేయడంలో ముందుండే హీరో ఎవరంటే అందరికీ ముందుగా గుర్తుకువచ్చే పేరు అక్షయ్ కుమార్. ఇటీవల వరుసగా పలు డిఫరెంట్ క్యాటగిరి సినిమాలతో దూసుకెళ్తున్న అక్షయ్, ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బ్యూటిఫుల్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటిస్తోంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగ్ సెట్లో హీరో అక్షయ్, దర్శకుడు రోహిత్ కొట్టుకున్నారని,
అయితే వారిద్దరిని వారించేందుకు నిర్మాత కరణ్ జోహార్ ముందుకు వచ్చి ఆ గొడవను ఆపేశారని నిన్న ఒక జాతీయ పత్రిక లో వార్త రావడం జరిగింది. అయితే ఈ వార్త అక్షయ్ వరకు చేరడంతో అది చదివిన ఆయన నవ్వుకున్నారట. అంతటితో ఆగకుండా కొంత ఫన్నీ గా అలోచించి, ఆ వార్తను నిజం చేస్తే పోలా అని భావించి, నిజంగానే తాను మరియు దర్శకుడు రోహిత్ శెట్టి నిజంగానే కొట్టుకున్నారట. అయితే నిజంగా కాదులెండి, ఒకింత సరదగా మాత్రమే. ఇక వీరిద్దరూ కొట్టుకుంటున్న వీడియోని హీరోయిన్ కత్రినా తన మొబైల్ లో షూట్ చేయడం జరిగింది.
ఇక ఆ ఫేక్ వార్తను తన మొబైల్ లో చూపించి,ఆ తరువాత అక్షయ్, రోహిత్ ఇద్దరూ కొట్టుకున్న వీడియోని కఠిన తన మొబైల్ లో చిత్రీకరిస్తున్న వీడియో మొత్తాన్ని తన అక్షయ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసారు. కాసేపటికి నిర్మాత కరణ్ జోహార్ అదే వీడియోని ట్యాగ్ చేస్తూ సరదాగా నవ్వుతూ ఒక పోస్ట్ పెట్టారు. ఇక ఈ వీడియో నేడు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. కాగా ఆ విధంగా తప్పుడు వార్తను ప్రచురించిన సదరు పత్రిక వారిపై పలువురు నెటిజన్లు తిడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు….!!

Read more RELATED
Recommended to you

Latest news