బ‌న్నీకి ఏడుగురు మేనేజర్ల‌ట‌.. అందుకే..

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం రిలీజ్ కు ముందు హీరో అల్లు అర్జున్ ఓ మీడియా సంస్థకు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో సొంత ప్రొడక్షన్ సంస్థ గీతాఆర్ట్స్ కార్యాలయంలోనే తనకు సొంత రూమ్ ఉండేదని తెలిపారు. అప్పట్లో తన మేనేజర్ బన్నీ వాసుతో ఆ రూమ్ లోనే ఉండి తన సినిమా వర్క్ లన్నీ చేసుకునేవాడ్నని వివరించారు.

ఆ తర్వాత తన మార్కెట్ పెరగడంతో బయటి చిత్రాల పనులను కూడా గీతాఆర్ట్స్ కార్యాలయంలోనే నిర్వహంచుకోవడం సరికాదనిపించిందని, అందుకే బయట సొంతగా ఆఫీసు ప్రారంభించానని బన్నీ వెల్లడించారు. దానికితోడు ప్రస్తుతం తనకు ఏడుగురు మేనేజర్లు ఉన్నారని, వారందరితో ఒకే రూమ్ లో కార్యకలాపాలు సాగించడం కష్టమని భావించి ప్రత్యేకంగా ఆఫీసు ఉంటే బాగుంటుందని నిర్ణయించుకున్నామని చెప్పారు. అయితే, గీతా ఆర్ట్స్ నుంచి బన్నీ బయటికొచ్చేశాడని అనేక పుకార్లు వచ్చాయని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news