ఇది కదరా కిక్ అంటే :: అల్లూ అర్జున్ సినిమా కి ఫస్ట్ రివ్యూ మహేశ్ బాబు రాస్తున్నాడు ?

-

 

మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై ఇప్పటికే సినీ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత తమ హీరోని మాస్ అవతార్ లో చూసేందుకు సూపర్ స్టార్ ప్రేక్షకులంతా రెడీ అయిపోయారు. అయితే ఇదే సమయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురం లో కూడా బరిలో నిలవడంతో పోటీ కాస్త తారాస్థాయికి చేరింది.

 

పక్క పక్క రోజుల్లోనే విడుదలవుతున్న ఈ రెండు సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లను కూడా అలాగే ప్లాన్ చేసుకుని విజయవంతంగా జరుపుకున్నాయి. అయితే అల్లు అర్జున్ తన ఈవెంట్ లో మహేష్ బాబు యొక్క ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం హిట్ కావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సభాముఖంగా తెలియజేశాడు కానీ మహేష్ మాత్రం తన ఈవెంట్లో బన్నీ సినిమా గురించి కనీసం ప్రస్తావించలేదు కూడా.

అందుకే మహేష్ బాబు ఇప్పుడు తన సినిమాకి జరుగుతున్న ప్రమోషన్ లలో భాగంగా ఒక అడుగు ముందుకు వేసి అల వైకుంఠ పురం లో చిత్రం ఖచ్చితంగా హిట్ కొడుతుంది అని తను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అన్న రీతిలో ఒక డైలాగ్ వదిలేందుకు సిద్ధమయ్యాడట. అప్పుడు ఏదో ఏమరపాటు లో ఉండి ఆ విషయాన్ని పట్టించుకోలేదు కానీ తనతో రెండు సినిమాలు తీసిన త్రివిక్రమ్ తో స్టైలిష్ స్టార్ నటించిన సినిమా హిట్ కొట్టాలని మనసు పూర్తిగా అభినందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news