రామ్ చ‌ర‌ణ్ భార్య‌కు అక్కినేని అమ‌ల ఛాలెంజ్‌..

-

మెగా కోడలు.. రామ్ చ‌ర‌ణ్ భార్య.. ఉపాసన కొణిదెలకు అక్కినేని అమ‌ల ఛాలెంజ్ విసిరారు. ఇదేదో సినీ ఛాలెంజ్ అనుకున్నారేమో.. కాదండోయ్‌..! ఎంపీ జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రోజు రోజుకూ విస్తరిస్తోంది. దేశాన్ని గ్రీన్ గా మార్చే లక్ష్యంతో ఆయన ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రముఖుల నుంచి మొదలు అన్ని వర్గాల వారు భాగస్వాములవుతున్నారు. ఈ ట్రెండ్ కొనసాగించడానికి సినిమా వాళ్లు కూడా ముందుకొస్తున్నారు. ఇక తాజాగా అమల అక్కినేని కూడా చేసింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్(ఐఏఎస్) విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ఆమె స్వీకరించింది. తన ఇంటి ఆవరణలోనే ఐదు మొక్కలు నాటింది నాగార్జున సతీమణి.

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా యజ్ఞం ఇంత దిగ్విజయంగా కొనసాగడం ఆనందంగా ఉందని చెప్పింది అమల అక్కినేని. ఇలాంటి మంచి ఆలోచనలు అరుదుగా వస్తాయని.. వాటిని ఆచరణలో పెట్టే బాధ్యత అందరిపై ఉందని చెప్పింది ఈమె. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇక మొక్కలు నాటిన తర్వాత రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలకు ఈమె గ్రీన్ ఛాలెంజ్ విసిరింది. ఆమెతో పాటు వసంత వాడి.. హీరా రూపానీ.. బీసీహెచ్ టీమ్‌లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరింది.

Read more RELATED
Recommended to you

Latest news