ఎంపీ గారి పరవశం

-

తెలంగాణ రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌, కాళేశ్వర జలాల పరవళ్లను తన కెమెరాలో బంధించి పరవశించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ఆ ఫోటోలను పోస్ట్‌ చేస్తూ, ఈ కామెంట్‌ను కూడా పెట్టారు.

కేసీఆర్ మానస పుత్రిక…
తెలంగాణ జీవన వరప్రదాయినీ..
కోటి ఎకరాలు మాగాణికి మణిహారం..
పరవళ్లు తొక్కుతున్న కాళేశ్వరం జలాలు…

తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలల పంట. తెలంగాణ ప్రధాన అవసరమైన నీళ్లకోసం ఎన్నో ఏళ్లు మేధోమధనం సాగించిన ఆయన సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసారు. తద్వారా తెలంగాణలోని కోటికి పైగా ఎకరాల పొలాలకు నీళ్లివ్వాలని సంకల్పించారు. ఆయన సంకల్ప ఫలితమే నేటి ఈ కాళేశ్వరం.

Read more RELATED
Recommended to you

Latest news