గోల్డెన్ కలర్ శారీలో పుత్తడిబొమ్మలా అనసూయ.. ఫొటోలు వైరల్

-

అనసూయ బుల్లితెరపై తన ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు వెండితెరపై తన సత్తా చూపిస్తోంది. ఓవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు అగ్రహీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తోంది. అలా వచ్చినవే రంగమ్మత్త, దాక్షాయణి పాత్రలు. ఈ పాత్రల్లో అనసూయ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలా ఓవైపు వెండితెరపై సందడి చేస్తూనే బుల్లితెరపైనా కనిపిస్తోంది.

ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ తన ఫొటోలతో పాటు అప్పుడప్పుడు తన పోస్టులతోనూ సంచలనం సృష్టిస్తూ ఉంటుంది. ఇక తన అభిప్రాయాలు పంచుకుంటూ నెట్టింట తరచూ ట్రోలింగ్​కు గురవుతూ ఉంటుంది. తాజాగా అనసూయ లేటెస్ట్ ఫొటోషూట్​ చేసింది. గోల్డెన్ కలర్ శారీలో అనసూయ పుత్తడిబొమ్మలా కనిపిస్తోంది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు అనసూయ బంగారం అంటూ కామెంట్లు పెడుతున్నారు. అనసూయ ట్రెడిషనల్ లుక్​కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఎప్పుడూ ఇలా నిండుగా ఉంటే ఎంత బాగుంటావ్ అనూ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news