నెటిజన్ల పై విరుచుకుపడిన అనసూయ…..!! వీడియో

-

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశు వైద్యురాలు దిశ హత్యోదంతంపై ప్రజలు, ప్రజా, మహిళా సంఘాల నుండి విమర్శల వెల్లువ మొదలైంది. ప్రజలు సహా రాజకీయ, సినిమా ప్రముఖులు కూడా ఈ దారుణ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే మన సినిమా పరిశ్రమ నుండి పలువురు నటీనటులు ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేయగా, మొన్న యాంకర్ అనసూయ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. అన్ని విధాలా తన మేధస్సుతో ముందుకు వెళ్తున్న మనిషి, మానసికంగా మాత్రం ఇటువంటి విషయాల్లో ఎంతో దిగజారిపోతున్నాడని,

ఇటువంటి దారుణాలకు ఒడిగట్టిన నిందితులకు కఠిన శిక్షలు అమలు చేస్తేనే కానీ ఇటివంటివి భవిష్యత్తులో చాలావరకు తగ్గే అవకాశం ఉందని ఆమె మాట్లాడుతూ చెప్పింది. కాగా నేడు, దిశా ఘటన పై ఆమె తన ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ అకౌంట్స్ లో వచ్చిన కొన్ని కామెంట్స్ కు ఘాటుగా బదులిచ్చారు. మొదట కొందరు నెటిజన్లు పెట్టిన కామెంట్లను చదివి వినిపించిన అనసూయ, ఇటువంటి దారుణాలు జరిగినపుడు సాటి మనిషిగా బాధపడవలసింది పోయి, అమ్మాయిలు మాలాంటి వాళ్ళ వల్లనే బ్యూటీ పార్లర్లకు వెళ్లి మేకప్ లు వేసుకోవడం వంటివి చేస్తున్నారు,

అటువంటివే అమ్మాయిలపై అఘాయిత్యాలు జరగడానికి మూలకారణం అని అనడం సరైనది కాదని కామెంట్స్ పెట్టిన వారికి వార్నింగ్ ఇచ్చింది. అంతేకాక, ముందుగా మీ తల్లితండ్రులు మీకు ఆడవారి పట్ల గౌరవ మర్యాదలతో మెలగాలనేది నేర్పాలని, చిన్నప్పటి నుండే మీ కోసం ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది, మీరు చేయదల్చుకున్నవన్నీ కూడా ఆ అమ్మాయితోనే చేయాలంటూ కొంత ఆవేదనతో అనసూయ బదులివ్వడం జరిగింది. కాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…..!!

Read more RELATED
Recommended to you

Latest news