డ్రీమ్ ప్రాజెక్ట్ మామూలుగా ఉండదు..మనసులో మాట బయటపెట్టిన ప్రముఖ డైరెక్టర్

-

చిత్ర దర్శకులు ప్రతీ ఒక్కరికి డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉదాహరణకు దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ అని చాలా కాలం నుంచి చెప్తున్నారు. తప్పకుండా ‘మహాభారతం’ వెండితెర మీద ఆవిష్కరించాలని అనుకుంటున్నానని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి వివరించారు.

అనిల్ రావిపూడి తీసిన సినిమాలన్నీ కమర్షియల్ గా ఫుల్ సక్సెస్ అయిన సంగతి అందరికీ విదితమే. కామెడీని ప్రధానమైన అంశంగా హైలైట్ చేస్తూ తన దైన శైలిలో సినిమాలు చేస్తూ హిట్స్ మీద హిట్స్ కొడుతున్నారు ఈ డైరెక్టర్. ఎంటర్ టైన్మైంట్ ఉన్న సినిమాలు కావాలంటే ఈ యన దర్శకత్వంలో వచ్చిన పిక్చర్స్ చూస్తే చాలు అనేంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ పిక్చర్ తీసిన అనిల్..ప్రస్తుతం F3 ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. F2కు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలు కాగా, హీరోయిన్స్ తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా కౌర్. ఈ నెల 27న ఎఫ్3 విడుదల కానుంది. ఈ సంగతులు పక్కనబెడితే..అనిల్ రావిపూడి తన డ్రీమ్ ప్రాజెక్టు టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్యతో సినిమా చేయడమేనని చెప్పారు.

డిఫరెంట్ జోనర్ లో బాలయ్యతో సినిమా చేస్తున్నానని, అందులో సర్ ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉండబోతున్నదని తెలిపారు. ఇంతకీ ఆ సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఏమిటి? అనే సంగతి తెలియాలంటే ఆ పిక్చర్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చి రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news