ప్ర‌భాస్ `సాహో`లో అనుష్క‌.. ఎందుకు మిస్ చేసుకుందో తెలుసా..?

-

ప్ర‌భాస్‌, అనుష్క‌.. ఈ పేర్లు వింటేనే ఎక్క‌డో తెలియ‌ని హ్యాపినెస్ గుర్తుకువ‌స్తుంది. ప్రభాస్, అనుష్క మధ్య ఉన్న రిలేషన్ గురించి అందరికీ తెలుసు. అభిమానులకు ఇంకా బాగా తెలుసు. తమ మధ్య స్నేహం తప్ప మరెలాంటి బంధాలు, అనుబంధాలు లేవని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు ఈ జోడీ. కానీ, వీరిద్ద‌రి పెళ్లి అయితే బాగుండు అని చాలా మంది కోరుకుంటారు. ఇక వీరిద్ద‌రూ క‌లిసి బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాలలో కలిసి న‌టించి ఎంత‌గానో ఆక‌ర్షించారు.

అయితే ప్ర‌భాస్ సాహో సినిమాలోనూ అనుష్క ఉండాల్సింద‌ట‌. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు సుజీత్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ నటించింది. అయితే సాహో సినిమా అనుష్క ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించాల్సిందట. అందుకు నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు కూడా చేశార‌ట‌.

అయితే దీని పట్ల అనుష్క ఆసక్తిగా ఉన్నప్పటికీ నిశ్శబ్దం మూవీ షూటింగ్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉండ‌ని మిస్ చేసుకుంద‌ట‌. అలాగే ఈ స్పెష‌ల్ సాంగ్ కోసం కేవ‌లం వారం డేట్స్ అడుగుగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోయారట అనుష్క. మ‌రియు తన వల్ల మొత్తం నిశ్శబ్దం టీం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడడంతో అనుష్క ఆ స్పెషల్ సాంగ్ ఇష్టం ఉన్న‌ప్ప‌టికీ చేయలేకపోయారట. కాగా, ప్ర‌స్తుతం చాలా గ్యాప్ త‌ర్వాత అనుష్క నిశ్శబ్దం సినిమాలో న‌టిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుద‌ల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news