ఖాళీ లేదని చెప్తే కోపాలా ఇప్పుడు నన్నేం చేయమంటారు ..?

-

ప్రస్తుతం బాలీవుడ్ లో కియారా అద్వానీ స్టార్ హీరోయిన్ గా గట్టి పోటీ ఇస్తుంది. ఇప్పుడు కియారా స్టార్ హీరోల ఛాయిస్ గా మారింది. 2021 వరకు కియారా అద్వాని ఫుల్ బిజీ షెడ్యూల్స్ తో గడపనుంది. చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా బాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. అంతేకాదు మరో వైపు టాలీవుడ్ లో మేకర్స్ కొంతమంది స్టార్ హీరోల తో తెరకెక్కే సినిమాల కోసం కియారాతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ లో సినిమా ఒప్పుకునే అవకాశం కనిపించడం లేదని తెలుస్తుంది.

 

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్మించిన ‘లస్ట్ స్టోరీస్’తో బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన కియారా… రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘గిల్టీ’ ద్వారా అందరూ మరోసారి తనవైపు చూపు తిప్పుకొనేలా చేసింది. అయితే తనకు లైఫ్ ఇచ్చిన కరణ్ జోహార్ ఇప్పుడు కియారా పేరు వింటేనే చిర్రు బుర్రులాడుతున్నాడ. ఈ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ల హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు ఏ హీరోయిన్ అయినా రిస్క్ చేయదు. ఎలాగోలాగా డేట్స్ అడ్జెస్ట్ చేసుకొని ప్రాజెక్ట్ కమిటవుతుంది. కానీ కియారా కి ఇప్పుడు అంత అకాశం కూడా దొరకడం లేదట.

కరణ్ జోహార్ తన సొంత నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్ హౌస్ లో ‘మిస్టర్ లేలే’ అనే తాజా చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ ని అనుకున్న కరణ్ జోహార్ కియారా తో సినిమా చేయమని అడిగాడట. అయితే కియారా రణ్ జోహార్ కి షాకిచ్చిందని లేటెస్ట్ న్యూస్. కానీ కియారా కరణ్ జోహార్ కి నో అని చెప్పిందట. దాంతో హర్ట్ అయిన కరణ్ జోహార్ లైఫ్ ఇచ్చిన నాకే డేట్స్ ఇవ్వడం లేదని కరణ్ జోహార్ ఫీలవుతున్నాడని బాలీవుడ్ మీడియాలో చెప్పుకుంటున్నారట. మరి బాలీవుడ్ లో కరణ్ జోహార్ లాంటి బడా నిర్మాత అందులో తనకి లైఫ్ ఇచ్చిన నిర్మాత అంటే ఎలా ఉండాలి. మరీ ఇలా హర్ట్ చేస్తే మళ్ళీ కియారాకి బాలీచుడ్ లో అవకాశాలు వస్తాయా అని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారట. అయితే అందుకు కియారా మాత్రం ప్రస్తుతం వరుసగా సినిమాలు కమిటై ఉన్నాను. ప్రజెంట్ డేట్స్ సర్ధుబాటు చేయలేను. దీనికే కోపాలొస్తే నన్నేం చేయమంటారు అంటూ అమాయకంగా అడుగుతుందట.

Read more RELATED
Recommended to you

Latest news