బడ్జెట్ ఎంతో చెప్పండి.. టికెట్ ధర పెంపుదల గురించి ఆలోచిస్తాం : ఏపీ సర్కార్

-

ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ ఈవెంట్​లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు తన లేటెస్ట్ మూవీ భోళా శంకర్​కు కాస్త కష్టాలు తెచ్చిపెట్టాయనే చెప్పొచ్చు. ఎందుకంటే.. భోళా శంకర్‌ సినిమా టిక్కెట్‌ ధరలు పెంచాలని కోరుతూ ఏపీ సర్కార్​కు దరఖాస్తు చేసుకోగా ఆ ప్రభుత్వం దాన్ని పెండింగ్​లో పెట్టింది. దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, మరిన్ని వివరాలు అందజేయాలని చిత్ర యూనిట్‌ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం కోరాయి.

ఏపీలో 20 శాతం చిత్రీకరణ.. హీరో, హీరోయిన్‌ రెమ్యునరేషన్‌ కాకుండా రూ.100 కోట్ల బడ్జెట్‌ వ్యయం తదితర వివరాలు ఈ దరఖాస్తుకు జత చేయలేదని, వాటిని ఇవ్వాలని కోరాయి. భోళా శంకర్‌ సినిమా ఈనెల 11న విడుదల కానుంది. ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమ మీద పడతారేంటి?’ అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆయన నటించిన భోళాశంకర్‌ సినిమా టిక్కెట్ల ధరల పెంపునకు ఇంకా ఏపీ ప్రభుత్వం అనుమతి లభించకపోవడం చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news