ట్రిపుల్ ఆర్ గెస్ట్ అతనే..!

-

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మరో భారీ బడ్జెట్ మూవీ ట్రిపుల్ ఆర్. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఈ సినిమా ముహుర్తం పెట్టారు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా ఓపెనింగ్ కు ఎవరు గెస్ట్ గా వస్తారన్న దాని మీద డిస్కషన్స్ మొదలయ్యాయి. కొందరేమో ఇండస్ట్రీ మొత్తం ఆ సినిమా ఓపెనింగ్ కు కదిలివస్తుంది అంటుంటే. మహేష్ బాబు వస్తాడని ఒకరు.. ప్రభాస్ వస్తాడని మరొకరు అంటున్నారు.

డివివి దానయ్య ఎలాగు మహేష్ తో ఈమధ్యనే భరత్ అనే నేను సినిమా చేశాడు. రాజమౌళితో కూడా తర్వాత సినిమా ప్లాన్ లో ఉన్నాడు. అతనే వచ్చే అవకాశాలున్నా ప్రస్తుతం మహేష్ మహర్షి షూటింగ్ లో ఉన్నాడు కాబట్టి ఆ ఛాన్స్ లేదని తెలుస్తుంది. అందుకే ట్రిపుల్ ఆర్ ఓపెనింగ్ కు ప్రభాస్ ఫిక్స్ అవ్వొచ్చని అంటున్నారు. బాహుబలితో ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు. అదీగాక బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మూవీ కాబట్టి ప్రభాస్ కచ్చితంగా చిత్రయూనిట్ ను విష్ చేయడానికి వస్తాడని చెప్పొచ్చు.

ఇక ట్రిపుల్ ఆర్ విషయానికొస్తే నవంబర్ లో మొదలవుతున్న ఈ సినిమా 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో కథానాయకులు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news