వైరల్ అవుతున్న ఎన్.టి.ఆర్, బాలకృష్ణ వీడియో..!

-

హరికృష్ణ మరణం నందమూరి ఫ్యామిలీని ఒక్కటి చేసిందా అంటే అవుననే అంటున్నారు సన్నిహిత వర్గాలు. అన్న మరణంతో విషాదంలో మునిగిన బాలకృష్ణ అన్న కొడుకులను ఓదార్చడంలో ముందున్నాడు. నార్కెట్ పల్లి హాస్పిటల్ నుండి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు దగ్గరే ఉండి అన్ని చూసుకున్నాడు.

కొన్నాళ్లుగా నందమూరి హీరోల మధ్య సఖ్యత లేదని తెలిసిందే. ముఖ్యంగా బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ల మధ్య దూరం నందమూరి ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టింది. హరికృష్ణ మరణం వారి మనసులను మార్చేసింది. కరెక్ట్ టైంలో బాబాయ్ గా తన బాధ్యత నెరవేరుస్తూ మనసులు గెలిచాడు బాలయ్య బాబు.

బాలకృష్ణ, ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం మాట్లాడుతున్న వీడియో వైరల్ గా మారింది. హరికృష్ణ మరణ వార్త నందమూరి ఫ్యాన్స్ ను షాక్ కు గురయ్యేలా చేసింది. అయితే బాలయ్యతో ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం మంతనాలు చూసి వారికి అండగా ఉంటున్న బాలయ్యని చూసి మెచ్చుకుంటున్నారు. బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ కలయిక కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసిన ఫ్యాన్స్ ఇలా కలవడం కాస్త విచారకరంగా ఉన్నా హరికృష్ణ వెళ్లిపోయి కుటుంబాన్ని ఒకటి చేశాడని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news