‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’లో బాలకృష్ణ.. థియేటర్లో ఫ్యాన్స్ విజిల్స్

-

సినిమా ఏదైనా.. థియేటర్​లో జై బాలయ్య.. జైజై బాలయ్య అనే స్లోగన్ వినిపించాల్సిందే. తాజాగా విడుదలైన అనుష్క-నవీన్ పొలిశెట్టి నటించిన మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమా థియేటర్లలోనూ ఈ స్లోగన్ వినిపించింది. అయితే ఇది కేవలం థియేటర్లలో మాత్రమే కాదు ఆ సినిమాలో కూడా వినిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో బాలకృష్ణ కూడా ఉన్నారు. నిజమండీ బాబు ఈ సినిమాలోని పలు సన్నివేశాల్లో బాలకృష్ణ కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

అయితే, ఆయన అతిథి పాత్రలో నటించలేదు. ఇందులో బాలకృష్ణ నటించిన పలు చిత్రాలను రిఫరెన్స్‌గా చూపించారు. అనుష్క – జయసుధలపై చిత్రీకరించిన ఓ సన్నివేశంలో ‘జై బాలయ్య.. జై జై బాలయ్య.. మన బాలయ్య.. ఈస్ట్‌ ఆర్‌ వెస్ట్‌ బాలయ్య ఈజ్‌ ది బెస్ట్‌’ అంటూ జయసుధ చెప్పే స్లోగన్స్‌ థియేటర్స్‌లో ఈలలు వేయిస్తున్నాయి. ఓ సన్నివేశంలో ‘అఖండ’ ఎంట్రీ సీన్స్‌ను చూపించారు. ఇక, ఈ సీన్స్‌ వచ్చినప్పుడు సినీ ప్రియులు సైతం ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేస్తున్నారని నెటిజన్లు ట్వీట్స్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news