బండ్ల – పూరి సెటిల్‌మెంట్ స్టోరీ‌!

-

బండ్ల గ‌ణేష్ – వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌ల మ‌ధ్య మంచి అనుబంధం వుంది. దానికి సాక్ష్యంగా స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేసిన `ఇద్ద‌ర‌మ్మాయిల‌తో` మూవీ టైమ్‌లో ఇచ్చిన కాస్ట్‌లీ గిఫ్ట్ నిలిచింది. ఈ మూవీ టైమ్‌లో బండ్ల గ‌ణేష్ త‌న చిర‌కాల మిత్రుడు పూరికి 44 ల‌క్ష‌లు విలువ చేసే ఓ లైట‌ర్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ టైట‌ర్‌కి 1455డైమండ్స్ వున్నాయి. అందుకే ఆ లైట‌ర్‌ అంత కాస్ట్లీ అయ్యింది.

పూరికి ఇదొక్క‌టే కాదు బండ్ల గ‌ణేష్ మ‌రో కాస్ట్‌లీ గిఫ్ట్ కూడా ఇచ్చిన‌ట్టు ఈ మ‌ధ్యే తెలిసింది. పూరితో `టెంప‌ర్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించిన బండ్ల గ‌ణేష్ త‌న మిత్రుడి కోసం ఓ సెటిల్‌మెంట్ కూడా చేశార‌ట‌. హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల రియల్ భూమ్ మొద‌లైన సంద‌ర్భంలో సెల‌బ్రిటీలంతా భారీ స్థాయిలో సిటీ స‌రౌండింగ్‌లో భూములు కొనుగోలు చేశారు. పూరి కూడా షాద్‌న‌గ‌ర్ ఏరియాలో 50 ల‌క్ష‌లు పెట్టి ఓ ల్యాండ్ కొన్నార‌ట‌. అయితే ఆ ల్యాండ్ అమ్మిన వారు త‌న‌ని మోసం చేశార‌ని తెలిసి ఆ పేప‌ర్ల‌ని అవ‌త‌ల పారేశార‌ట.

అదే స‌మ‌యంలో పూరి ఆఫీస్‌కి వ‌చ్చిన బండ్ల గ‌ణేష్ విష‌యం తెలుసుకుని త‌న ఏరియాలో జ‌రిగింది కాబ‌ట్టి తానే సెటిల్ చేస్తాన‌ని చెప్పి ఆ పేప‌ర్స్ తీసుకుని వెళ్లార‌ట‌. మొత్తానికి సెటిల్ చేసిన బండ్ల 50 ల‌క్ష‌లు కూడా రాద‌ని ఫీలైన పూరీకి అదే ల్యాండ్ ద్వారా దాదాపు అంత‌కు ప‌దిరెట్ల మొత్తాన్ని తిరిగి పూరికి అందించిన‌ట్టు తెలిసింది. ఈ విష‌యం తెలిసి పూరి అవాక్క‌య్యార‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news