BREAKING : ‘జై కాంగ్రెస్’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్

-

BREAKING : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో నిలుస్తుంటారు.

అయితే, తాజాగా బండ్ల గణేష్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కాంగ్రెస్ లోకి మళ్లీ సినీ నిర్మాత బండ్ల గణేష్ రానున్నారు. ఈ మేరకు ‘జై కాంగ్రెస్’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అంతేకాదు.. CLP నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొనున్నారు బండ్ల గణేష్. ఈ మధ్యే మల్లికార్జున ఖర్గే, డీకె శివ కుమార్ , రేవంత్ రెడ్డి ని కలిశారు బండ్ల గణేష్. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన బండ్ల గణేష్‌… కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు బండ్ల గణేష్. అయితే.. కాంగ్రెస్ ఓటమి మనస్థాపంతో తరువాత సైలెంట్ అయిన బండ్ల గణేష్.. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news