ఇక సెలవు అంటూ పోస్ట్ చేసిన బండ్ల గణేష్.. అసలేమైందంటే..?

-

బండ్ల గణేష్.. ప్రముఖ నటుడిగా , నిర్మాతగా , రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇటీవల డేగల బాబ్జి సినిమాతో హీరోగా కూడా అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. నిర్మాతగా పలు చిత్రాలకు వ్యవహరించి మరింత పాపులాటిని సంపాదించుకున్న బండ్ల గణేష్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ను ఆరాధ్య దైవంగా భావించే బండ్ల గణేష్ కనీసం ఒక్క సినిమాలో అయినా సరే ఆయనతో నటించనిదే సినిమా ముందుకు సాగదు అంటూ చెబుతూ ఉంటాడు. అంతలా పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని పెంచుకున్నారు బండ్ల గణేష్.

అంతేకాదు పవన్ కళ్యాణ్ కు పరమ భక్తుడైన బండ్ల గణేష్ ఆయన గురించి మాట్లాడితే పవన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ రావడం ఖాయమే .. అంతలా పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చూపుతూ అభిమానులలో మరింత పాపులారిటీని దక్కించుకున్నారు బండ్ల గణేష్.. అయితే ఈ మధ్యకాలంలో తరచూ వివాదాలలోకి తలదూరుస్తున్న విషయం తెలిసిందే .తనకు సంబంధం లేని విషయాలలో కూడా తలదూరుస్తూ బాగా వైరల్ అవుతూ వస్తున్నారు.

అయితే తాజాగా ఈయన చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. “రాజకీయాల వల్ల జీవితంలో చాలా నష్టపోయాను. నాకు ఏ రాజకీయాలతో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అందరూ ఆత్మీయులే”.. అంటూ రాసుకు వచ్చాడు అయితే బండ్ల గణేష్ నిర్ణయాన్ని స్వాగతించని కొంతమంది అభిమానులు పవన్ లా పోరాడాలని తెలుపగా.. నాకు అంత స్థాయి లేదు అంత గొప్పవాన్ని కాదు సోదరా.. అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు రాజకీయాలకు ఇక సెలవు అంటూ కూడా తెలిపారు బండ్ల గణేష్. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారగా మరికొంతమంది పోనీలే ఇన్నాళ్లకు మంచి నిర్ణయం తీసుకున్నావు అని కొంతమంది చెబుతున్నారు.. ఇంకొంతమంది సడన్గా రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఏంటి అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news