బ్యూటీ స్పీక్స్ : ప్రియమయిన శ్రీవల్లి వల్లించునది!

-

వ‌రుస విజ‌యాలు అందుకుంటున్న ఆమెను ఉద్దేశించి స‌రిలేరు నీకెవ్వ‌రు శ్రీ‌వ‌ల్లీ అని పొగుడుతున్నారు అభిమానులు. అప్పుడు శ్రీ‌వ‌ల్లి,ఇప్పుడు ఆద్య. ఈ రెండు పాత్ర‌లూ కూడా వేటిక‌వే ప్ర‌త్యేకం అని చెబుతున్నాయి చిత్ర సీమ వ‌ర్గాలు. మొన్న‌టి వేళ అంటే ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌ల్లో ఆమెతో క‌ళావ‌తి (స‌ర్కారు వారి పాట ఫేం కీర్తి సురేశ్)తో ఆడిపాడారు కూడా! క‌నుక ఇప్పుడు ఫ్యాన్స్ మ‌రింత పండగ చేసుకోవ‌చ్చు. ఒకవిధంగా క‌ళావ‌తి(కీర్తి సురేశ్),భానుమ‌తి (సాయిప‌ల్ల‌వి), శ్రీ‌వ‌ల్లి (ర‌ష్మిక‌) ఒకే వేదికపై చేసిన సంద‌డి చూశాక ఆనందంతో వారంతా ఉబ్బిత‌బ్బిబ‌వుతున్నారు.

ఆడ‌వాళ్ల‌కు జోహార్లు
ర‌ష్మిక‌కు జోహార్లు
తెగువ తెలివి ఉన్న ఆడ‌వాళ్లు
ఈ స‌మాజాన్ని శాసిస్తారు
స్వ‌ప్న కాలాల‌ను నిజం చేసుకుని
మంచి ఫ‌లితాలు అందుకుంటారు
ఆ విధంగా విజ‌యం అందుకున్న
ఆడ‌వాళ్ల‌కు వారి గొప్ప గొప్ప భావాల‌కు
జోహార్లు చెప్ప‌డంలో త‌ప్పేం లేదు
మంచి భావ‌న‌లు పెంపొందించిన మాతృమూర్తుల‌కు
వంద‌నాలు కూడా మీరు చెప్పాలి..
అప్పుడు మాత్ర‌మే అంతా ఆనందిస్తారు.

అందం క‌న్నా అదృష్టం ఎక్కువ‌గా ఉన్న కార‌ణంతో రాణించే మ‌గువ‌ల జాబితాలో ర‌ష్మిక‌ను చేర్చండి. అందానికి ప్రాముఖ్యం ఇవ్వడం క‌న్నా అవ‌కాశాలు అందిపుచ్చుకోవ‌డంలో ఆమె చూపుతున్న శ్ర‌ద్ధ‌ను చూసి మెచ్చుకోండి. ప్ర‌స్తుతం ఆమె ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అన్న సినిమాలో న‌టిస్తున్నారు. త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. త్వ‌ర‌లో అంటే ఈ శుక్ర‌వార‌మే అని అర్థం.

తిరుమ‌ల కిశోర్ అనే వ‌ర్థ‌మాన ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే ప్రీ రిలీజ్ వేడుక‌లు వైభ‌వోపేతంగా జ‌రిగాయి. ఇదే వేడుక‌ల్లో డైరెక్ట‌ర్ సుకుమార్ తో స‌హా సాయిప‌ల్ల‌వి వ‌చ్చి సంద‌డి చేసింది. కీర్తి సురేశ్ వారితో జ‌త క‌లిసింది. ఇక ఈ సినిమాపైనే త‌న ఆశ‌లు అన్నీపెంచుకున్నాను అని చెబుతున్నారు ఆమె. పుష్ప త‌రువాత వ‌చ్చిన అవ‌కాశం ఇది ఆమెకు. ద‌ర్శ‌కులు తిరుమ‌ల కిశోర్ కు ఆడ‌వాళ్ల ప‌ట్ల ఉన్న గౌర‌వానికి సంకేతం ఈ సినిమా అని చెబుతున్నారామె.

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక పాత్ర‌ను ఓ క‌థానాయిక‌ను కానీ నాయ‌కుడ్ని కానీ ఉద్దేశించి రాస్తే ఎంత గొప్ప‌గా ఫీల్ అయిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ని, కానీ ఈ సినిమాలో త‌న‌ను దృష్టిలో ఉంచుకునే నాయిక పాత్ర‌ను రాశాన‌ని ద‌ర్శ‌కులు తిరుమ‌ల కిశోర్ చెప్ప‌డం త‌న‌కు ఎంతో నచ్చింద‌ని అన్నారు. గీతగోవిందం కూడా పూర్తిగా ఆమె చుట్టూ న‌డిచే సినిమానే! అదేవిధంగా ఈ సినిమా కూడా కానుంది అని ర‌ష్మిక చెప్ప‌క‌నే చెబుతున్నారు.

ఈ సినిమాలో క‌థ న‌డిచే తీరు హైలెట్ గా ఉంటుంద‌ని, స‌ర‌దాస‌ర‌దాగా సాగే స‌న్నివేశాలు విని ప‌డి ప‌డి న‌వ్వుకున్నాన‌ని, త‌న‌తో పాటు సీనియ‌ర్ న‌టులు రాధిక‌, ఖుష్బూ, ఊర్వ‌శి, క‌ల్యాణి, ఝాన్సీ తెర‌పై సంద‌డి చేస్తార‌ని ఇదొక అరుదైన సంద‌ర్భం అని అంటున్నారామె. ఈ సినిమాలో త‌న‌పేరు ఆద్య అని, త‌న త‌ల్లిపేరు వ‌కుళ అని చెప్పారామె. ముక్కుసూటి అమ్మాయిగా ఇందులో క‌నిపిస్తాన‌ని, అల‌రిస్తాన‌ని,గ‌త సినిమాల్లో మాదిరిగానే హీరోను టీజ్ చేస్తూ ఉంటాన‌ని ప్ర‌ముఖ మీడియాకు వివ‌రించారామె. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుందాం.

– బ్యూటీ స్పీక్స్ – మ‌న‌లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Latest news