భరత్ భామ లవ్ లో పడ్డదా.. ఆ హీరోతో చెట్టాపట్టాల్..!

-

భరత్ అనే నేను సినిమా హీరోయిన్ కియారా అద్వాని బాలీవుడ్ హీరోతో లవ్ లో పడ్డదన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ రొమాంటిక్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియరా అద్వాని ప్రేమలో ఉందట. అందుకే అమ్మడు బర్త్ డేకు సిద్ధార్థ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడని టాక్. అలియా భట్, జాక్వెలిన్ తర్వాత సిద్ధార్థ్ కియరా మోజులో పడ్డాడని తెలుస్తుంది.

ఎం.ఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీలో సెకండ్ హీరోయిన్ గా చేసిన కియరా అద్వాని తెలుగులో మహేష్ భరత్ అనే నేను సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ తర్వాత రాం చరణ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఈమధ్యనే బాలీవుడ్ లస్ స్టోరీస్ అంటూ ఓ వెబ్ సీరీస్ లో కూడా నటించింది కియరా అద్వాని. ఇక అందులో అమ్మడి హాట్ ఎక్స్ ప్రెషన్స్ కు కుర్రాళ్లంతా ఫిదా అయ్యారని చెప్పొచ్చు.

మరి సిద్ధార్థ్ తో కియరా కేవలం స్నేహం మాత్రమేనా లేక అ.. ఆ.. ఇ.. ఈలు చదివేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. బాలీవుడ్, టాలీవుడ్ తేడా లేకుండా అమ్మడు అక్కడ ఇక్కడ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version