యాక్టింగ్ మొదలుపెట్టిన గంగవ్వ… అతనికి మోనాల్ గోరుముద్దలు..?

-

తొలి, రెండవ వారంలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన బిగ్ బాస్ షో మూడో వారంలో టాస్కుల వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ముచ్చటగా స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ హౌస్ లోకి మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టింది. నిజానికి బిగ్ బాస్ షో ప్రారంభం కాక ముందే స్వాతి దీక్షిత్ హౌస్ లోకి వెళుతోందంటూ ప్రచారం సాగింది. ఆ ప్రచారం ఎట్టకేలకు నిజం కావడం గమనార్హం.

నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లోని అబ్బాయిలు బిగ్‌బాస్ కంటెస్టెంట్ట్స్ అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్రతిజ్ఞ చేయగా అఖిల్, అభిజిత్ మాత్రం తెలివిగా ఈ ప్రతిజ్ఞ నుంచి తప్పించుకున్నారు. నోయల్ ను బిగ్ బాస్ జైలు నుంచి విడుదల చేయగా అతనికి హౌస్ మేట్స్ గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. గంగవ్వ ఉక్కు మనుషులు టాస్క్ లో ఎవరు ఏ విధంగా చేశారో చేసి చూపించడంతో అవ్వ కూడా యాక్టింగ్ మొదలుపెట్టిందని అమ్మ రాజశేఖర్ కామెంట్ చేశారు.

దీంతో అమ్మ రాజశేఖర్ మాస్టర్ గంగవ్వ కూడా యాక్టింగ్ మొదలుపెట్టిందని చెప్పాడు. గంగవ్వ ఇంట్లో తనకు మోనాల్ నచ్చదని కామెంట్ చేయడం గమనార్హం. అనంతరం బిగ్ బాస్ రంగు పడుద్ది అనే కెప్టెన్సీ టాస్క్ ఇవ్వగా గంగవ్వ కెప్టెన్ అయింది. అయితే గంగవ్వ వల్ల మిగతా కంటెస్టెంట్లు నష్టపోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత మోనాల్ తో అఖిల్ తాను పెళ్లి చేసుకోవడానికి రాలేదని చెప్పగా ఆమె అఖిల్ ను కూల్ చేయడం కొరకు గోరుముద్దలు తినిపించింది.

ఆ తర్వాత స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ స్వాతి దీక్షిత్ హౌస్ లోని అబ్బాయిల కొరకు స‌ర్‌ప్రైజ్ తీసుకొచ్చినట్టు చెప్పాడు. ఎవరైతే స్వాతి దీక్షిత్ ను మెప్పిస్తారో వారికి సర్ ప్రైజ్ ఉంటుందని బిగ్ బాస్ అన్నాడు. కవితలు, ప్రేమ కావ్యాలు చెప్పి నోయ‌ల్‌, అవినాష్‌, అఖిల్, అమ్మ రాజశేఖర్ స్వాతిని మెప్పించగా ఆమె వారికి ఎర్రగులాబీలు ఇచ్చింది. ఆ తర్వాత ఒక స్పెషల్ రూమ్ లో స్వాతి దీక్షిత్ తో కలిసి నలుగురు పార్టీ చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news