బిగ్ బాస్: శ్రీ సత్య బండారం బయటపెట్టిన ఫైమా తల్లి..!

-

తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ ల తల్లిదండ్రులు వచ్చి వారిని సర్ప్రైజ్ చేశారు. ఈ క్రమంలోని శ్రీ సత్య బండారం బయట పెడుతూ ఫైమాకు జాగ్రత్తలు చెప్పింది ఆమె తల్లి.. కూతుర్ని కలుసుకున్న ఫైమా తల్లి కూతురితో మాట్లాడుతూ..ఎంతవరకు మాట్లాడాలో.. అంతే మాట్లాడింది. ఎంతవరకు చెప్పాలో.. అంతే చెప్పింది.. ఆమె మాట్లాడుతూ ..”నువ్వు వెటకారం తగ్గించుకో.. కోపం తగ్గించుకో.. జనాలకు నచ్చడం లేదు ..ఓపిక పట్టు.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది కదా.. దానిని ఉపయోగించుకో.. దాన్ని ఎవరికీ ఇవ్వొద్దు” అని ఫైమాతో చెప్పింది.

అలాగే శ్రీ సత్య గురించి కూడా మాట్లాడుతూ..” ఆమెతో చాలా జాగ్రత్త .. ఎందుకు చెప్తున్నానో విను.. నీ ముందు ఒకటి మాట్లాడుతుంది.. వెనుక ఇంకొకటి మాట్లాడుతుంది.. ఆమెతో జాగ్రత్త.. ఇనయాతో కూడా కలిసిమెలిసి ఉండు .. మాట్లాడు.. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు .. నామినేషన్స్ చేసేటప్పుడు ఆలోచించి నామినేషన్ చేయి.. ఆలోచించి మాట్లాడు..” అంటూ పైమా కి పలు జాగ్రత్తగా చెప్పింది ఆమె తల్లి. ఆ తర్వాత బిగ్ బాస్ “కని పెంచిన మా అమ్మకే అమ్మయానుగా” .. అని పాట వేయడంతో పెద్దావిడ కూతురితో కలిసి స్టెప్పులు వేసింది . “ఇది ప్రేమా ప్రేమా” అంటూ తల్లిని ఎత్తుకొని ఫైమా సంబరంలో మునిగి తేలింది..

ఆ సమయంలోనే గుండెల్ని పిండేసే ఒక సీన్ చూపించారు బిగ్ బాస్. అనాధ ఆయన కీర్తి ఆ తల్లి కూతుర్లను చూస్తూ తీవ్ర భావోద్వేగానికి గురై ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయి.. బాత్రూంలోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది.. కీర్తిని అలా చూస్తుంటే నిజంగానే గుండె తరుక్కుపోయినంత పని అయింది . తల్లి కూతుర్ల ప్రేమ కళ్ళ ముందు కనిపించేసరికి బాధను తట్టుకోలేకపోయింది కీర్తి. నేటి ఎపిసోడ్లో కీర్తి బాధను చూపించిన విధానం చాలా పెయిన్ ఫుల్ గా అనిపించింది. ఆ తర్వాత హౌస్ లోకి శ్రీ సత్య పేరెంట్స్ కూడా వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news