Bigg Boss 5 Telugu: షన్ను పరువు తీసిన ‘గృహలక్ష్మీ’ లాస్య.. కార‌ణ‌మదేనా?

-

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ రియాలిటీ షో 5వ సీజ‌న్ విజ‌యవంతంగా కొన‌సాగుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ గేమింగ్ షో రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. సీజ‌న్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది ఉత్కంఠ మ‌రింత పెరుగుతోంది. ఎలాగైనా టైటిల్ కైవ‌సం చేసుకోవాల‌ని కంటెస్టెంట్ త‌మ త‌మ శ‌క్తియుక్తుల‌ను ప్ర‌యోగిస్తున్నారు. తత్ఫ‌లితంగా కుటుంబ స‌భ్యుల మ‌ధ్య మాటల యుద్దాలు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో సోషల్ మీడియా వేదిక ర‌చ్చ జ‌రుగుతుంది. నెటిజన్లు తమ అభిమాన కంటెస్టెంట్ కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హిస్తోన్నారు. బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లలో మ‌ధ్య‌ పోటీ సహజమే.

ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ 5 ప్ర‌ముఖ‌లు కూడా త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో
బుల్లితెర న‌టి, యాంకర్ ప్రశాంతి ఈ షో పై రియాక్ట్ అయ్యింది. తాజాగా త‌న ఇన్ స్ట్రాం వేదికగా.. అభిమానులతో లైవ్ ద్వారా ముచ్చటించింది. వారి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చింది. ఈ క్ర‌మంలో కొందరు నెటిజన్లు.. బిగ్ బాస్ సీజన్ 5 మీద త‌న అభిప్రాయ‌మేమిటో చెప్పాల‌ని కోరారు.

ప్రస్తుతం బిగ్ బాస్ లో పాల్గొనే వారంతా తన స్నేహితులేనని ప్రశాంతి చెప్పుకొచ్చింది. కొంద‌రి ఆట తీరు బాగుంద‌ని కితాబు ఇచ్చింది. ఎవరైతే ఎక్కువ పర్ఫామెన్స్ చేస్తారో వారికే ఓటు వేయాలి. వారికే మద్దతు ఇవ్వాలి. బయట మాకు చాలా ఫాలోయింగ్ ఉంది కదా? అని ఇంట్లో పర్ఫామెన్స్ చేయకుండా ఉన్న వాళ్లకు మద్దతు ఇవ్వకూడదని, షోలో యాక్టివ్ గా టాస్క్ లలో పాల్గొంటూ, గేమ్ బాగా ఆడే వారికి మాత్రమే ఓట్లేసి గెలిపించండని ప్ర‌శాంతి చెప్పుకొచ్చింది.

అయితే.. బిగ్ బాస్ లో ఎవ్వ‌రికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందో అంద‌రికీ తెలుసు. అలాగే గేమ్ సరిగా ఆడ కుండా సైలెంట్ గా కూర్చుంటున్నారో అంద‌రికీ తెలుసు. ఆమె మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే.. ష‌న్నుకి ఓటేయ్యోద్ద‌ని చెప్ప‌క‌నే చెప్పింది. అలాగే.. బయట వాళ్ళ ఫాలోయింగ్ చూసి మోసపోవద్దు అంటూ
ఇన్ డైరెక్ట‌ర్ గా షణ్ముఖ్ పై సీరియస్ కామెంట్స్ చేసింది గృహ‌ల‌క్ష్మీ ఫేం లాస్య‌.

షణ్ముఖ్ ఆట తీరుపై విమ‌ర్శ‌లు రావ‌డం కొత్తేమీ కాదు. ప్రారంభం నుంచే.. గేమ్ ఆడకుండా సైలెంట్ గా కూర్చుంటున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆయ‌నకు యూట్యూబ‌ర్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూత్‌లో వెబ్ సిరీస్‌ల ద్వారా షన్నుకు క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగే షన్నును కాపాడుతోంది. ఇక ఇంటి సభ్యులు కూడా షన్నును నామినేట్ చేయాలంటే భయపడు తున్నారనే టాక్ కూడా ఉంది. షన్నును నామినేట్ చేస్తే అతని అభిమానులు ఎక్కడ ఓట్లు వేయరోనని భయపడి నామినేట్ చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి షన్ను మీద ప్రశాంతి చేసిన కామెంట్లు మాత్రం అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news