ట్రిపుల్ ఆర్ లో ఆమె ఫిక్సా..!

-

బాహుబలి తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా వస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో కూడా ఎన్.టి.ఆర్, రాం చరణ్ లకు సంబందించిన సీన్స్ షూట్ చేస్తున్నారట.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తేలలేదు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం బాలీవుడ్ భామ పరిణితి చోప్రా ఆర్.ఆర్.ఆర్ లో ఒక హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తుంది. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అయిన పరిణితి చోప్రా ఈమధ్య అక్కడ జోరు తగ్గించింది. అడపాదడపా సినిమాలు చేస్తూ ఫోటో షూట్స్ కే పరిమితమైన ఈ అమ్మడిని ట్రిపుల్ ఆర్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడట రాజమౌళి. తన కాస్టింగ్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉండే రాజమౌళి ఎంచుకున్న కథకు తగిన పాత్రదారులను తీసుకుంటాడు. మరి తెలుగులో ట్రిపుల్ ఆర్ తో పరిణితి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అదే నిజమైతే పరిణితి చోప్రా కెరియర్ మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news