‘ సాహో ‘ క్రేజ్ చూసి బాలీవుడ్ కుళ్లుకుంటోందా…

-

ప్రస్తుతం దేశం మొత్తం సాహో మేనియాతో ఊగిపోతోంది. ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రో మూడు రోజుల టైం మాత్ర‌మే మిగిలి ఉంది. ప్ర‌స్తుతం దేశంలోని అన్ని సినిమా ఇండ‌స్ట్రీ పెద్ద‌లు, ట్రేడ్ వ‌ర్గాలు సాహో గురించే మాట్లాడుకుంటున్నాయి. దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా సాహో సాహో అని ప‌ల‌క‌రిస్తున్నారు. అంతలా సాహో ఫీవర్ దేశాన్ని పట్టిపీడిస్తోంది. సాహోకి వస్తున్న ఈస్పందన బాలీవుడ్ బడా హీరోలను బెంబేలెత్తిస్తోంది.


ఓ రీజ‌న‌ల్ హీరో సినిమాకు ఇంత క్రేజ్ రావ‌డం ఏంట్రా ?  బాబు అని వారంతా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. సాహోకు ఈ రేంజ్‌లో క్రేజ్ రావ‌డం పైకి చెప్ప‌డం ఇష్టం లేక‌పోయినా బాలీవుడ్ బ‌డా హీరోల్లో చాలామందికి ఇష్టం లేద‌ని తెలుస్తోంది. ఇక సాహోను యాంటీగా ప్ర‌మోట్ చేసేందుకు బాలీవుడ్ మీడియా సైతం కాచుకుని కూర్చొని ఉంది.

అంతెందుకు బాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కుతున్నా వాటికి దేశవ్యాప్తంగా ఇంత హైప్ రాకపోవడం గమనార్హం. అమీర్, సల్మాన్ లాంటి వాళ్ల‌ను ప‌క్క‌న పెడితే మిగిలిన హీరోలు కోట్లాది రూపాయ‌ల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాలు చేసినా వాటికి ఈ రేంజులో క్రేజ్ ఎప్పుడూ రాలేదు. ప్రస్తుతం రణ్వీర్ కపూర్, అమితాబ్, అలియా భట్ ప్రధానపాత్రలలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్ర గురించి చాలా మందికి తెలియ‌దు.

కానీ సాహో సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచే దేశ‌వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచింది. గ‌తంలో అమీర్ ఖాన్, కత్రినా, అమితాబ్ వంటి స్టార్ కాస్ట్ తో వచ్చిన భారీ బడ్జెట్ తెరకెక్కిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ కి కూడా అనుకున్నంత ప్రచారం దక్కలేదు. ఆ సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. ఇక మ‌రో రెండు తెలుగు సినిమాలు అయిన సైరా, ఆర్ ఆర్ ఆర్ గురించి కూడా ఇప్పుడు జాతీయ‌స్థాయిలో చ‌ర్చ న‌డుస్తోంది. ఏదేమైనా తెలుగు సినిమా ఎదుగుద‌ల బాలీవుడ్ వాళ్ల‌కు ఇష్టం లేద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news