మణిరత్నం ఆఫీస్ కు బాంబ్ బెదిరింపులు..!

-

సౌత్ లో క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన మణిరత్నం తన మార్క్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. కొన్నాళ్లు కెరియర్ లో చాలా వెనుకపడ్డ మణిరత్నం ఒకే కన్మణి (ఓకే బంగారం) సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు. అయితే ఆ తర్వాత వచ్చిన చెలియా సినిమా అంచనాలను అందుకోకున్నా లాస్ట్ వీక్ వచ్చిన నవాబ్ సినిమా అంచనాలను అందుకుంది.

మణిరత్నం స్టైల్ లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తమిళంలో నాలుగు రోజుల్లో 30 కోట్ల వసూళ్లు చేసి దూసుకెళ్తుంది. తెలుగులో ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కలక్షన్స్ డల్ గానే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ అభ్యంతరకంగా ఉన్నాయని.. వాటిని సినిమా నుండి తొలగించకపోతే చెన్నైలోని మణిరత్నం ఆఫీస్ పేల్చేస్తామని ఎవరో వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడట. వెంటనే ఆఫీస్ స్టాఫ్ అంతా ఖాళీ చేసి బయటకు వెళ్లారట.

అంతేకాదు పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. తమిళంలో చెక్క చివంత వానం టైటిల్ తో వచ్చిన ఈ సినిమాలో అరవింద స్వామి, శింభు, విజయ్ సేతుపతి వంటి వారు నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news