గీతా గోవిందం కలక్షన్స్ అన్ని కేరళ వరద బాధితులకే..!

-

కేరళలో భారీ వర్షాలు అక్కడ ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చింది. వరదలా వర్షాల తాకిడి వల్ల అక్కడ జనజీవనం స్థంభించి పోయింది. అక్కడ ప్రభుత్వం ఇప్పటికే నష్ట నివారణ చర్యలు చేపడుతున్నా తమ వంతు సాయంగా సెలబ్రిటీస్ కదిలి వస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ హీరోలు విశాల్, సూర్య విరాళాలు ప్రకటించగా తెలుగు పరిశ్రమ నుండి రాం చరణ్, బన్ని, విజయ్ దేవరకొండ కూడా కేరళ బాధితులకు తమ వంతు సాయం ప్రకటించారు.

ఇక అదే దారిలో గీతా గోవిందం నిర్మాత బన్ని వాసు కూడా గీతా గోవిందం కేరళలో వచ్చే వసూళ్లను అక్కడ బాధితులకు ప్రకటించారు. అయితే అక్కడ వర్షాలు పడుతుంటే అక్కడ వసూళ్లు ఎలా వస్తాయని డౌట్ రావొచ్చు. కేరళలో భారీగా రిలీజ్ అయిన గీతా గోవిందం లాంగ్ రన్ లో ఎంతొచ్చినా అది వరద బాధితులకు ఇస్తామని తన మంచి మనసు చూపించారు బన్ని వాసు.

ఇక సినిమా రిజల్ట్ విషయానికొస్తే.. విజయ్ కెరియర్ లో గీతా గోవిందం మరో సూపర్ హిట్ అందుకుంది. సినిమా అనుకున్న దానికన్నా భారీగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news