BREAKING : పవన్‌ ఫ్యాన్స్‌ కు షాక్‌…”బీమ్లానాయక్‌” ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు

-

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. ఇవాల జరుగాల్సిన “బీమ్లా నాయక్‌” ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు అయింది. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి మృతి పట్ల నేపథ్యంలో.. “బీమ్లా నాయక్‌” ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

“ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆకస్మిక మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు & స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి. గౌరవ సూచకంగా, #Bheemlanayak ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగదు!” అంటూ బీమ్లా నాయక్‌ చిత్ర బృందం ప్రకటించింది. ఇవాళ సాయంత్రం 6 గంటల సమయంలో ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించాలని చిత్ర బృందం భావించింది.

అంతేకాదు.. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు మంత్రి కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా రానున్నారు. కాగా.. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి.. కాసేపటి క్రితమే మృతి చెందిన సంగతి తెలిసిందే. గుండె పోటు రావడంతో.. మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి.. మరణించారు. దీంతో వైసీపీ పార్టీ లో విషాదం చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news