చంద్రయాన్​-3పై ట్వీట్.. ప్రకాశ్ రాజ్​పై కేసు నమోదు

-

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆయన ‘చంద్రయాన్ 3’ పై పెట్టిన ఓ పోస్టు వైరల్గా మారడంతో నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. ‘చంద్రయాన్ 3’ గురించి భారతీయులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ.. ప్రకాశ్ రాజ్ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలోనే కర్ణాటకలోని భాగల్కోట్ జిల్లాలో నటుడు ప్రకాశ్రాజ్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలోని బనహట్టి పోలీస్ స్టేషన్లో ప్రకాశ్రాజ్పై హిందూ సంస్థల నాయకులు ఫిర్యాదు చేశారని.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు.

ప్రకాశ్ రాజ్ ట్వీట్ ఏంటంటే.. చంద్రుడి పైనుంచి విక్రమ్ ల్యాండర్ పంపించిన తొలి ఫొటో ఇదేనంటూ ఓ చాయ్ వాలా ఫొటోను ప్రకాశ్ రాజ్.. ఆదివారం ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్పై తీవ్ర విమర్శలు రావడంతో.. దానికి సమాధానంగా.. మరో ట్వీట్ చేశారు. “విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూడగలదు. నేను కేవలం కేరళ చాయ్ వాలా గురించి మాత్రమే పోస్ట్ పెట్టాను. మరి ట్రోలింగ్ చేసిన చాయ్ వాలా ఎవరు? జోక్ ని జోక్ లాగే చూడాలి. లేకపోతే అది మన పైనే అనుకోవాల్సి వస్తుంది. గ్రో అప్” అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news