Breaking: వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు..హీరోయిన్ సాయిపల్లవిపై కేసు నమోదు

-

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందంటూ కొందరు పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

హీరోయిన్ సాయిపల్లవి
హీరోయిన్ సాయిపల్లవి

 

భజరంగ్ దళ్ నాయకులు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో హీరోయిన్ సాయి పల్లవిపైన కేసు పెట్టారు. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో పాటు గో రక్షకులపైన సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు ఆధారాలు కూడా సమర్పించారని వినికిడి. వీడియోను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news