17 ఏళ్ల తర్వాత వస్తున్న చంద్రముఖి సీక్వెల్.. రిలీజ్ డేట్ లాక్!

-

లకలకలకలకలకలక.. చంద్రముఖి.. అంటూ 17 ఏళ్ల క్రితం సినీ ప్రేక్షకులను భయపెట్టిన సినిమా చంద్రముఖి. డైరెక్టర్ పి. వాసు తెరకెక్కించిన ఈ చిత్రం తలైవా రజనీకాంత్ సినిమా కెరీర్​ను మలుపు తిప్పిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని చాలా మంది ప్రయత్నించారు. కానీ ఆ మాస్టర్ పీస్​కు సీక్వెల్​కు తీయడం అంత ఈజీ కాదుగా. ఎట్టకేలకు ఫస్ట్ పార్ట్ తెరకెక్కించిన వాసు ఇప్పుడు సీక్వెల్ కూడా తీస్తున్నారు.

లారెన్స్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేసుకుంది. హార్రర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పార్ట్‌ పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇక ఈ సినిమాను వినాయక చివితి సందర్భంగా సెప్టెంబర్‌ మాసంలో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. కంగనా రనౌత్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రాధికా శరత్‌కుమర్‌, వడివేలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎమ్‌.ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్‌ నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news