ఆమె కోసం ప్రభాస్ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేసిన చరణ్.. సక్సెస్ అవుతాడా.?

-

సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల మధ్య మంచి అవినాభావ స్నేహబంధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా తమకు వచ్చిన విషయాన్ని అలాగే నచ్చిన విషయాన్ని తోటి సెలబ్రిటీలతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా ఒక ఛాలెంజ్ ను రామ్ చరణ్ కోసం విసరగా ఆయన యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే.. తాజాగా అనుష్క, నవీన్ పోలిశెట్టి నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.

ఈ సినిమా ఈరోజు ఉదయం విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క శెట్టి ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ చాలెంజ్ పేరుతో చిత్ర ప్రచారాన్ని ప్రారంభించగా.. ఈ సినిమాలో చెఫ్ అన్విత రవళి శెట్టి అనే పాత్రలో అనుష్క నటించింది. ఇదిలా ఉండగా చాలెంజ్ లో భాగంగా తనకు ఇష్టమైన వంటకాలు మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు స్పెషల్ నీర్ దోశ రెసిపీలను ఎలా తయారు చేయాలో సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది.

తర్వాత ఈ చాలెంజ్ను రెబల్ స్టార్ ప్రభాస్ కి విసరగా ఆయన తనకు ఇష్టమైన రొయ్యల పలావ్ ఎలా తయారు చేయాలో సోషల్ మీడియా ద్వారా వివరించారు. ఆ తర్వాత ఈ ఛాలెంజ్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ప్రభాస్ విసరగా.. ప్రభాస్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన రాంచరణ్ తనకు ఇష్టమైన చేపల పులుసు ఎలా తయారు చేయాలో వివరించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వివరాలను కూడా పంచుకున్నారు. ఆ తర్వాత ఈ ఛాలెంజ్ను రానా దగ్గుబాటికి విసరగా.. ఇక ఆయన ఎలాంటి రెసిపీతో మన ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. మొత్తానికి అయితే సినిమా ప్రమోషన్స్ ఇలా సెలబ్రిటీలతో చేయిస్తూ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news