‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్​గా చిన్న జీయర్ స్వామి

-

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్​కు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో జరగబోయే ఈ ఈవెంట్​ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తిరుపతిలో ఈ ఈవెంట్ చాలా గ్రాండ్​గా జరగనుంది. దాదాపు రెండు కోట్ల ఖర్చుతో ఈ ఈవెంట్​ను ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈవెంట్​లో స్పెషల్ అట్రాక్షన్​గా ఫైర్ వర్క్స్ ఉండనున్నాయట. జైశ్రీరామ్ అనే శబ్ధం వచ్చేలా బాణా సంచాను రెడీ చేస్తున్నారట.

అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్​కు వచ్చే గెస్టుల గురించి ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. తాజాగా ఈ మూవీ మేకర్స్ గెస్ట్ ఎవరో చెప్పేశారు. ఆదిపురుష్ ఈవెంట్​కు త్రిదండి చిన్నజీయర్ స్వామి గెస్టుగా రానున్నారట. ఇక ఈ ఈవెంట్ లో అజయ్-అతుల్ జై శ్రీరామ్ పాటకు లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా దాదాపు రెండు వందల సింగర్స్, రెండు వందల డ్యాన్సర్లు ముంబయి నుంచి ఈ వేడుకకు వస్తున్నారట. పది రోజుల్లో విడుదల కాబోతున్న ఆదిపురుష్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూన్ 16న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news