పారిస్ ఒలింపిక్స్‌ 2024 వేడుకల్లో చిరు ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్

-

పారిస్ వేదికగా ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రపంచ దేశాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయ, సినీ, క్రీడా రంగ నిపుణులు ఈ ఈవెంట్ను వీక్షించారు. ఈ నేపథ్యంలో పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరిమనీకి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కూడా హాజరైంది.

అల పారిస్ వీధుల్లో మెగా ఫ్యామిలీ జాలీగా విహరించింది. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తన భార్య సురేఖ, తనయుడు మెగాపవర్ స్టార్ రామ్చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి ఈ మెగా ఈవెంట్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను చెర్రీ సతీమణి ఉపాసన అభిమానుల కోసం సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ పారిస్ డైరీస్ నుంచి ఇంకా అప్డేట్స్ కావాలంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. స్వీట్ ఫ్యామిలీ అంటూ తెగ పొగడ్తలు కురిపించేస్తున్నారు. మొత్తానికి ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news