బింబిసార, సీతారామం సినిమాలు టాలీవుడ్ కు ఊపిరి పోశాయి – చిరంజీవి

-

బింబిసార, సీతారామం సినిమాలు టాలీవుడ్ కు ఊపిరి పోశాయని మెగాస్టార్‌ చిరంజీవి పేర్కొన్నారు. కల్యాణ్​రామ్​ ‘బింబిసార’, దుల్కర్​ సల్మాన్​ ‘సీతారామం’ చిత్రాలు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రీమియర్​ షోలకు మంచి రెస్పాన్స్​ వచ్చింది. రెండు కూడా పాజిటివ్​ టాక్​ తెచ్చుకున్నాయి. మంచి కలెక్షన్లు కూడా రాబడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే బింబిసార, సీతారామం సినిమాలపై చిరంజీవి స్పందించారు. ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీ కి ఎంతో ఊరటనీ మరింత ఉత్సాహాన్ని స్తూ, కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలయిన బింబిసార, సీతారామం చిత్రాలు రెండూ విజయం సాధించటం ఎంతో సంతోషకరం. ఈ చిత్రాల నటీనటులకు,నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మనః పూర్వక శుభాకాంక్షలు..అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. అటు పలుగురు హీరోలు కూడా ఈ సినిమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news