ఆత్మకథ రాస్తున్న చిరంజీవి…!

-

కరోనా వైరస్ పుణ్యమా అని సినిమాల షూటింగ్ లు ఎక్కడా కూడా జరగడం లేదు. ప్రజలు ఎవరూ సినిమాలకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి సినిమా షూటింగ్ లను కూడా ఆపేశారు. అలాగే విడుదల కూడా చేయడం లేదు. ఇక తమ వంతుగా లాక్ డౌన్ ని పాటిస్తుంది సినీ పరిశ్రమ. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం లాక్ డౌన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. చిరంజీవి సోషల్ మీడియాలో వీడియో లు రిలీజ్ చేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే ఆయన తాను ఇంట్లో ఎం చేస్తున్నానో కూడా పదే పదే చెప్తున్నారు. అప్పుడప్పుడూ వంట గదిలోకి వెళ్లి దోసెలు వేస్తున్నానని.. అలాగే పొద్దున్నే లేచి మొక్కలకు నీళ్లు పోస్తున్నానని.. టైమ్‌కు వ్యాయామం చేస్తున్నానని.. ఇంట్లో కూర్చుని పాత సినిమాలు చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. మొన్నా మధ్య ఆయన ఒక సందర్భంలో తన ఆత్మ కథను రాస్తాను అని చెప్పారు.

దీని కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇప్పుడు కరోనా తో షూటింగ్ లేదు. ఇప్పట్లో షూటింగ్ మొదలయ్యే అవకాశం కూడా లేదు కాబట్టి చిరంజీవి తన ఆత్మ కథను పూర్తి చేయడానికి సిద్దమయ్యారు. ఇప్పుడు ఆయన సాయంత్రం సమయంలో తన ఇంటి పెరట్లో కుర్చుని ఆత్మకథ రాస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ఆత్మ కథను పూర్తి చేసి మార్కెట్ లో విడుదల చెయ్యాలని భావిస్తున్నారు. అయితే ఇది వీడియో ల రూపంలో కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news