చిరు-కొరటాల మధ్య గ్యాప్.. కారణం అదేనంటా!

-

టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేషన్ లిస్ట్‌లో చిరంజీవి-కొరటాల శివ పేరు ఉంటుంది. ఆ ఇద్దరు కలుస్తున్నారంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆ అంచనాలను మించేలానే ఆచార్య చిత్రం తెరకెక్కుతోంది. టైటిల్ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఆ మధ్య చిరంజీవే నోరు జారి సభాముఖంగా టైటిల్‌ను బయట పెట్టేశాడు. తరువాత నాలుక కరుచుకుని కొరటాలకు సారీ కూడా చెప్పేశాడు అది వేరే విషయమనుకోండి.

ఆచార్య మూవీలో రామ్ చరణ్ ఓ ముఖ్య పాత్రను పోషించనున్నాడని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ ఆలస్యం అవుతుండటంతో ఆచార్య సినిమాకు డేట్స్ కుదరకపోవడంతో.. ఆ పాత్రను మహేష్ బాబుతో చేయించాలని కొరటాల ఫిక్స్ అయ్యారని, మహేష్‌ను కలిశాడని కూడా వార్తలు వచ్చాయి. మహేష్ కూడా సుముఖత వ్యక్తం చేశాడని కొందరు వార్తలు రాసేశారు. అయితే ఈ విషయమే చిరంజీవి, కొరటాల మధ్య చిచ్చు పెట్టినట్టు తెలుస్తోంది.

తన ప్రమేయం, అనుమతి లేకుండా మహేష్ బాబును సంప్రదించడం పట్ల చిరు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. కొరటాల చెప్పే లోపే వార్తలు దావానంలా పాకి చిరు చెవిలో  పడ్డాయని టాక్. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని తెలుస్తోంది. చివరకు ఆ పాత్రను రామ్ చరణ్ చేస్తేనే అన్ని విధాల కలిసి వస్తుందని యూనిట్ భావించడంతో మహేష్ వ్యవహారం ముగిసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news