నటుడు సునీల్ కు అస్వస్థత…. ఆందోళనలో ఫ్యాన్స్…..!!  

-

హీరో తరుణ్, రిచాల కలయికలో తెరకెక్కి అప్పట్లో సూపర్ హిట్ కొట్టిన నువ్వే కావాలి సినిమాతో టాలీవుడ్ కి కమెడియన్ గా పరిచయం అయిన హాస్య నటుడు సునీల్, ఆ తరువాత చిరునవ్వుతో, నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్, మనసంతా నువ్వే, నువ్వే నువ్వే తదితర హిట్ సినిమాల్లో తన హాస్యపు జల్లులతో తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించాడు. ఆ తరువాత అందాల రాముడు సినిమాతో హీరోగా మారిన సునీల్, ఆపై దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.

అయితే ఆ తరువాత నుండి హీరోగా సునీల్ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం మళ్ళి అక్కడక్క డ సినిమాల్లో కామెడీ పాత్రల్లో నటిస్తున్న సునీల్, అతి త్వరలో తెరకెక్కనున్న కలర్ ఫోటో అనే సినిమా ద్వారా తొలిసారి విలన్ గా నటించనున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ కు మంచి మిత్రుడైన సునీల్, ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాలో కూడా ఒక మంచి పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఇకపోతే నిన్నటి నుండి ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందులు పడుతున్న సునీల్, నేడు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో గల ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.

 

సైనస్ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం సునీల్ ఆ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక సునీల్ అస్వస్థతకు గురైన విషయం కాసేపటి క్రితం పలు మీడియా మాధ్యమాల ద్వారా బయటకు రావడంతో పలువురు సినిమా ప్రముఖులు సహా ఆయన ఫ్యాన్స్ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, ఆయనకు పెద్ద ప్రమాదం ఏమి లేదని, కొద్దిపాటి చిత్స తరువాత డిశ్చార్జి అవుతారని అంటున్నారు. కాగా సునీల్ అనారోగ్య విషయమై పూర్తి వివరాలు బయటకు రావలసి ఉంది….!!

Read more RELATED
Recommended to you

Latest news