వివాదం.. ‘ఆదిపురుష్’లో డైలాగ్ తొలగింపు

-

 

నేపాల్ లో ఆదిపురుష్ సినిమాపై వివాదం తలెత్తింది. సీత భారత్ లో జన్మించినట్లు చూపడంపై ఆ దేశ సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. సీత నేపాల్ లో జన్మించారని, దీనిని సవరించకుంటే విడుదలకు అనుమతినివ్వమని స్పష్టం చేసింది. అటు ఈ డైలాగ్ తీసేయకుంటే భారత సినిమాలు నిలిపేస్తామని పలువురు నేపాల్ నేతలు మండిపడ్డారు.

దీంతో డైలాగ్ తొలగించడంతో అక్కడ రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. కానీ మార్నింగ్ షోలు నిలిపివేసినట్లు సమాచారం. కాగా, ఆది పురుష్ మూవీ సక్సెస్ కావాలని మంత్రి రోజా ఆకాంక్షించారు. ‘శ్రీ రామచంద్రమూర్తి వారు ఒక రాజుగా తన ప్రజలకు మాత్రమే కాకుండా, భూమిపై ఉన్న ప్రతి జీవికి శ్రేయోభిలాషిగా ఉండేవారట. అలాంటి ఆది పురుషుడైన రామయ్య కథ ఆది పురుష్ గా ప్రజల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’ అని రోజా ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news