తెలంగాణ ఇచ్చిన జీవో బోగస్ : మంత్రి బొత్స

-

తెలంగాణ ఇచ్చిన జీవో బోగస్ అంటూ కేసీఆర్‌ సర్కార్‌ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యురైజేషన్ పై TS ప్రభుత్వం ఇచ్చిన జీవో బోగస్ అని మంత్రి బొత్స ఆరోపించారు. కావాలంటే అక్కడికి వెళ్లి పరిశీలించుకోవచ్చన్నారు.

వివిధ జిల్లాల నుంచి మంతిని కలిసేందుకు వచ్చిన కాంట్రాక్టు ఉద్యోగులను ఉద్దేశించి ఈ వాక్యాలు చేశారు. అక్కడ 960 మందిని రెగ్యులరైజ్ చేశారని, ఇక్కడ 10వేల మందిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు కాకపోయినా మళ్లీ జగన్ సీఎం అయ్యాక చేస్తామని తెలిపారు. అలాగే,  సీఎం పదవి నుంచి జగన్ ను దించే మగాడు ఈ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పుట్టలేదని పేర్కొన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news