తిరుపతి అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు

-

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్‌ వర్క్స్‌ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి.. ఆ ప్రాంతమంతా దట్టమైన మంటలు, పొగలు అలుముకున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడం.. మంటలు ఇళ్ల వైపు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గోవిందరాజస్వామి ఆలయ రథం వైపు మంటలు వస్తుండటంతో అగ్నిమాపక సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మంటల్లో ముగ్గురు వ్యక్తులు మంటల్లో చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇరుకైన ప్రాంతం కావడంతో మంటలు ఆర్పేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దూరం నుంచే మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

 

ఐదంతస్తుల భవనంలోని ఓ ఫ్లోర్‌లో ఫొటో ఫ్రేమ్‌ వర్క్స్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. అందులో విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రూ.కోట్ల విలువైన ఫొటోలు దగ్ధమయ్యాయి. మూడు అగ్నిమాపక వాహనాల్లో సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు భవనం ముందు ఉన్న ఐదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news