పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి వచ్చేసిన క్రేజీ అప్డేట్

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఓజీ. ఈ సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ ను నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ ట్వీట్ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తి చేసినట్టు చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. మిగిలిన పార్ట్ ను అత్యంత త్వరలోనే పూర్తి చేయనున్నట్టు సమాచారం.

పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తరువాత షూట్ చేయనున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉండటంతో మే-జూన్ నెలల్లో పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కోసం కొన్ని డేట్స్ కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఈలోపు మిగిలిన వారికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ 27 వరకు సిద్ధం చేయాలని భావిస్తోంది చిత్ర యూనిట్.

Read more RELATED
Recommended to you

Latest news