పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనె

-

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను ప్రెగ్నెన్సీ తో ఉన్నట్లు ప్రకటించింది దీపిక. ఆదివారం ఉదయం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దీపికా పదుకొనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.

దీంతో ఈ జంటకు అభినందనలు తెలుపుతూ పలువురు సెలబ్రిటీలు, నెటిజెన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక తల్లి, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీపిక పదుకొనే, రణవీర్ సింగ్ ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంట నవంబర్ 2018లో ఇటలీలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ బాలీవుడ్ లో పాపులర్ ఆర్టిస్టులుగా వెలుగొందుతున్నారు.

ఇటీవల కల్కి సినిమాతో అభిమానులను అలరించిన దీపిక.. వచ్చే ఏడాది మార్చ్ వరకు ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనదని తెలుస్తోంది. ఆ తరువాత కల్కి పార్ట్ 2 లో దీపిక కనిపించనుంది. అంతేకాకుండా బాలీవుడ్ మూవీ సింగం అగైన్ లో నటించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news